‘పదవిని మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి..’ అంటూ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చారు. ‘మా జాతి చిరకాల కోరిక, పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్..’ అంటూ ముద్రగడ పద్మనాభం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి లేఖాస్త్రం సంధించారు.
చంద్రబాబు హయాంలో తాము ఉద్యమించినప్పుడు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అత్యంత హేయంగా ఆ ఉద్యమాన్ని అణచివేసిందనీ, ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ది పొందిందనీ, ఇప్పుడు మాత్రం అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించారనీ వైఎస్ జగన్పై మండిపడ్డారు ముద్రగడ పద్మనాభం.. సున్నితంగానే. ‘పాలకులు ప్రజల యొక్క కష్టాలలో పాలుపంచుకోవాలి..’ అంటూ తనదైన స్టయిల్లో జగన్కి రాసిన లేఖలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.
‘మా జాతి సానుభూతి, ఓట్లు పొందారు..’ అంటూనే, ‘ఈ రోజు మా కోరికను దానం చేయడానికి మీకు చేతులు ఎందుకు రావడంలేదు.?’ ని నిలదీశారు. ‘అడిగినవారికి, అడగనివారికి.. హామీలు ఇవ్వని, ఇచ్చినవాటికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారు..’ అని ఓ పక్క పొగుడుతూనే, ఇంకోపక్క కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలేదని నిలదీశారు కాపు ఉద్యమనేత.
కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లను కోరుతోందనీ, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని ప్రశ్నిస్తే, కాపు సామాజిక వర్గానికే చెందిన దాదాపు డజను మంది వైసీపీ నేతలతో పవన్ కళ్యాణ్ని తిట్టించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మరి, ఇప్పుడు అదే తరహాలో ముద్రగడ పద్మనాభంపై తిట్ల వర్షాన్ని ఆ డజనుకి పైగా కాపు నేతలు కురిపించగలరా.?
344709 486604I agree with you. I wish I had your blogging style. 336435
450577 976739There is noticeably a bundle to learn about this. I assume you created positive great points in features also. 541728
300632 179723Really fascinating topic , thanks for putting up. 360553