‘కరోనాతో పోరాటంలో అన్ లాక్ 2.0లోకి ప్రవేశించాం. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వాతావరణం మార్పులో భాగంగా అందరూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి’ అని దేశ ప్రధాని మోదీ జాతినుద్దేశించిన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో కరోనాతో చనిపోతున్నవారి సంఖ్యలో భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. సరైన సమయంలో లాక్ డౌన్ చర్యలు తీసుకోవడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగాం.
అన్ లాక్ 1.0 ప్రారంభం నుంచి కేసులు పెరుగుతున్నాయి. కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఎవరైనా మాస్కులు ధరించకపోతే నిలదీయాలి. మాస్కులు వేసుకోవడంలో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా పాటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా చేయాల్సిన అవసరం ఉంది. ఒక దేశ ప్రధాని మాస్కు పెట్టుకోలేదని రూ.13 వేలు జరిమానా విధించారు. మన ప్రభుత్వాలు కూడా ఇదే స్ఫూర్తితో కఠినంగా వ్యవహరించాలి.
దేశంలో ఏ ఒక్కరూ చట్టానికి అతీతులు కారు. 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్ల నగదు జమ చేశాం. సామాన్యుల నుంచి ప్రధాని ఎవరూ నిబంధనల కంటే ఎక్కువ కాదు. రాబోయేది పండగల సీజన్. జులై నుంచి నవంబర్ వరకు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తాం. 5 కిలోల బియ్యంతోపాటు కిలో పప్పు ఇస్తాం. వాతావరణం మారుతున్నందున మీరందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి
325339 531996hi!,I like your writing so much! share we communicate far more about your write-up on AOL? I require an expert on this region to solve my problem. Maybe thats you! Looking forward to see you. 885382