ఏపీలో సంచలనం రేపిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ధ్రువీకరించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఉదయ్ భాస్కర్ ను నేడు రిమాండ్ కు తరలిస్తామని అన్నారు.
మరోవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇద్దరు స్నేహితులు పవన్, సుబ్రహ్మణ్యంలను పోలీసులు విచారిస్తున్నారు. హత్య జరిగిన రోజు వారిద్దరూ సుబ్రహ్మణ్యంతోనే ఉన్నారు. దీంతో వారిద్దరూ ఈ కేసులో కీలకం కానున్నారు. దీంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసులు అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది.
పోస్టుమార్టం నివేదికలో సుబ్రహ్మణ్యం హత్యకు గురైనట్టు తేలింది. ఆయన ప్రైవేట్ పార్ట్స్ పై బలమైన దెబ్బలు తగిలినట్టు రిపోర్టులో తేలింది. ఈనేపధ్యంలో ఈరోజు సాయంత్రం కాకినాడ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి సుబ్రహ్మణ్యం మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.
327116 277310I undoubtedly did not realize that. Learnt one thing new today! Thanks for that. 700961
365388 879748Hello! I just now would like to supply a massive thumbs up for any great details you could have here within this post. We are coming back to your weblog post for further soon. 41692