నాడు అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు పన్నుల భారంలో మొదటి స్థానంలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలంటూ ట్వీట్ చేశారు. ‘పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించాలని కోరడం ప్రశంసనీయం. పెట్రో ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
గతంలో ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రజలు భారం మోయలేక పోతున్నారని వివరించినా ప్రభుత్వం మాత్రం పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించలేదు. ఇప్పుడు కేంద్రం పెట్రోల్పై రూ.8లు, డీజిల్పై రూ.6లు పన్ను తగ్గించుకుంది. రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయి. ఏపీ ప్రజలు ఏం పాపం చేసారు..? వైసీపీ ప్రభుత్వం వెంటనే పన్ను తగ్గించుకుని రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అదే సమయంలో ఆయా రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపును ఇవ్వడం ప్రశంసనీయం.(1/4)
— N Chandrababu Naidu (@ncbn) May 23, 2022
146049 192775I got what you mean , saved to bookmarks , really decent web site. 569150
325834 700538There is noticeably a bundle to know about this. I assume you created certain nice points in attributes also 852866