ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటన వైసీపీ పొలిట్ బ్యూరో సమావేశంలా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘జగన్ ను కలిసేందుకు పారిశ్రామికవేత్తలు రావడం లేదు. ఆయన కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త ఆదానీ. ఆయనను కలిసేందుకు దావోస్ దాకా వెళ్లడం ఎందుకు.. ఢిల్లీ వెళ్తే సరిపోతుంది కదా. చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు.. జగన్ రెడ్డి రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా..? ఏపీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు..?
జగన్మోహన్ రెడ్డి నాపై మోపిన అసత్య ఆరోపణలు నిరూపించలేక కోవిడ్ నిబంధనల ఉల్లంఘనల కేసులో కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పటివరకు నాపై 14 కేసులు పెట్టారు.. కావాలంటే మరో 10కేసులు పెట్టుకోండి. జగన్ లా వాయిదాలు తీసుకునే వ్యక్తిని కాను. ఎమ్మెల్సీ ఆనంతబాబు హత్య చేసి తిరుగుతున్నా అరెస్టు చేయలేకపోతున్నారు. ఎమ్మెల్సీకి భద్రత కల్పించేది పోలీసులే. నేను కోర్టుకు వస్తే 500మంది పోలీసులు వచ్చారు. నా చుట్టూ తిరిగే బదులు ఎమ్మెల్సీ అనంతబాబుని పట్టుకోండి’ అని అన్నారు.
423460 916536You designed some decent points there. I looked online for the concern and identified a lot of people may go as well as utilizing your internet web site. 4516
142125 111694The entire glance of your site is magnificent, let well as the content! 316411