Miss World 2024: 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ (Miss World 2024) పోటీలు 28ఏళ్ల తర్వాత భారత్ వేదికగా జరుగబోతున్నాయి. 1996లో భారత్ ఆతిథ్యమివ్వగా.. వెనిజులాకు చెందిన ఇరెన్ స్కివా విజేతగా నిలిచింది. రేపు (మార్చి 9) జరుగబోయే ఫైనల్స్ లో 2024 విజేతను ప్రకటించనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరుగుతాయని భావించినా తర్వాత ఇండియాకు మార్చారు. ప్రస్తుత పోటీల్లో 112 మంది పాల్గొన్నారు. భారత్ తరపున మిస్ ఇండియా వరల్డ్2022 సిని శెట్టి ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఫిబ్రవరి 9న మొదలైన పోటీలు ఢిల్లీలోని భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్లో జరుగుతున్నాయి. 1951లో తొలిగా బికినీ పోటీలుగా ప్రారంభమైతే.. బ్రిటిషర్లు మిస్ వరల్డ్ అని పేరు పెట్టారు. స్వీడన్ కు చెందిన కికీ హకాన్సన్ తొలి మిస్ వరల్డ్ కిరీటం అందకున్నారు. భారత్ నుంచి..
రీటా ఫరియా (1966)
ఐశ్వర్యా రాయ్ (1994)
డయానా హెడెన్ (1997)
యుక్తాముఖి (1999)
ప్రియాంక చోప్రా (2000)
మానుషి చిల్లర్ (2017) ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు.