ఏపీ మంత్రి పేర్ని నానితో నటుడు మోహన్ బాబు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్యా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు చర్చకు వచ్చినట్టు సమాచారం. చిరంజీవి నేతృత్వంలోని బృందం సీఎం జగన్ తో జరిగిన భేటీకి మోహన్ బాబు హాజరు కాలేదు. ఈనేపథ్యంలో మోహన్ బాబుతో మంత్రి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై మోహన్ బాబుతో మంత్రి పేర్ని నాని చర్చించినట్టు తెలుస్తోంది. చిరంజీవి బృందం సీఎం జగన్ తో జరిగిన సమావేశం వివరాలను మోహన్ బాబుకు మంత్రి వివరించినట్టు సమాచారం.
మరోవైపు.. సినిమా టికెట్ల ధరలపై ఈ నెల 17న కమిటీ భేటీ కానుంది. ఈమేరకు సభ్యులకు ఉన్నతాధికారులు సమాచారం పంపారు. సీఎంతో జరిగిన భేటీలో హీరోలు చేసిన సిఫార్సులపై భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. టికెట్ ధరలు, అదనపు షోలు, భారీ బడ్జెట్ చిత్రాలు వంటి అంశాలపై చర్చ జరగనుంది.
728688 119088I was suggested this web website by my cousin. Im not positive whether this post is written by him as nobody else know such detailed about my difficulty. Youre incredible! Thanks! 912947