కేంద్రమంత్రుల్లో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓ ఆణిముత్యమని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణకు నూతన వైద్య కళాశాలల మంజూరు విషయంలో కిషన్ రెడ్డి చెప్పిన దానికి ఇతర కేంద్ర మంత్రులు చెప్పిన దానికి పొంతనలేదని అన్నారు.
తెలంగాణకు 9 వైద్య కళాశాలలు ఇచ్చామని కిషన్ రెడ్డి అంటున్నారు. 2 ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనలూ రాలేదని మరో కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ అంటున్నారు.
అబద్దాలు చెప్పడంలో అయినా మంత్రులకు శిక్షణ ఇవ్వండని ఈ సందర్భంగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోలేని 9వైద్య కళాశాలలను సృష్టించిన.. హైదరాబాద్ లో కల్పిత గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను ప్రకటించిన ఆణిముత్యం కిషన్ రెడ్డి’ అని అన్నారు. ఈమేరకు వైద్య కళాశాలలు, గ్లోబల్ సెంటర్ ఏర్పాటుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేశారు.
259399 283484Hello there, just became alert to your weblog by means of Google, and found that its really informative. Im going to watch out for brussels. I will appreciate in the event you continue this in future. Several folks is going to be benefited from your writing. Cheers! 950405
348273 864522No a lot more s . All posts of this qaulity from now on 604193