స్కూలుకు పంపిన పిల్లలకే అమ్మ ఒడి వస్తుందని.. స్కూలుకు వెళ్ళకుండా అమ్మ ఒడి రాలేదంటే ఎలా.. అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనేది అవాస్తవం. పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక జరిగింది. స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఉండకుండా విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించినప్పుడే ఇందుకు మార్గదర్శకాలు స్పష్టంగా చెప్పాం.
పిల్లలను పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లలను చదివించేందుకు ఆర్థిక పరమైన విషయాల్లో ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. రాష్ట్రంలో కార్పొరేట్, ప్రయివేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. విద్యా బోధనతో పాటు, బైజూస్ ద్వారా వారిలో నైపుణ్యాన్ని పెంచుతున్నాం. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత శాతం తగ్గలేదు. 2019లో కంటే ఇప్పుడు ఉత్తీర్ణత శాతం పెరిగింది. రాష్ట్రంలోని పాఠశాలు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
848853 837567Thank you for the auspicious writeup. It in truth used to be a amusement account it. Glance complex to far more added agreeable from you! Even so, how could we be in contact? 768781
324020 727261I always visit your blog and retrieve everything you post here but I never commented but today when I saw this post, I couldnt stop myself from commenting here. Fantastic post mate! 194602
143253 231292my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the top stuff 458284