కరోనాకు ఎఫెక్ట్ అవుతున్నవారిలో, మృతి చెందుతున్నవారిలో ఎక్కువ మంది పురుషులే ఉంటున్నారని గతం నుంచీ వాదనలు ఉన్నాయి. ఇందుకు కారణాన్ని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తమ పరిశీలనలో కొత్త విషయాలు కనుగొన్నారు. పురుషుల రక్తంలో టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్నవారే కోవిడ్ కు గురవుతున్నారని.. వారిలోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయిని తేల్చారు. ఇందుకు సంబంధించి కొన్ని పరిశోధనలు చేశారు. 90 మంది పురుషులు, 62 మంది మహిళల రక్త నమూనాలను సేకరించి హర్మోనుల పనితీరును పరిశీలించారు.
గతంలో టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉత్పత్తి కావడమే పురుషులు కోవిడ్ మరణాలకు కారణమని వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేల్చారు. మహిళల రక్త నమూనాల్లో వచ్చిన మార్పులకు కోవిడ్ తీవ్రతకు సంబంధం లేదని కూడా తేల్చారు. పురుషుల్లో టెస్టోస్టిరాన్ తగ్గిన వారిలో మరణించినవారు.. ఆ పరిస్థితుల్లోకి వెళ్లిన వారు ఉన్నారని అంటున్నారు. ఈ పరిశోధనలు కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడ్డాయని వారు అంటున్నారు.
575398 481229I like this post, enjoyed this one thanks for posting . 7920