తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ లభించింది. ఈకేసులో చంద్రబాబు ప్రమేయం లేదని ఈడీ తేల్చింది. ఈ మేరకు ఈడీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేసింది. గురువారం ఎంపీ రేవంత్ రెడ్డిపై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్ షీట్ లో పేర్కొంది.
మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసే విధంగా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో రాయబారం నడిపినట్టుగా రేవంత్ రెడ్డిపై చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ప్రలోభాలకు గురి చేశారని ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి. చార్జ్షీట్లో ప్రధాన నిందితుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి పేరును పేర్కొన్నారు. ఆయనతోపాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా నిందితుడిగా పేర్కొంది.
959203 85315Some genuinely superb blog posts on this web site , regards for contribution. 534215