కరోనాతో మృతి చెందితే మృతదేహాలను తరలించే క్రమంలో ఆంబులెన్సులు, అంత్యక్రియలు నిర్వహించే స్మశానవాటికల్లో దోపీడికీ పాల్పడుతున్నారన్న ఆరోపణలపై జీహెచ్ఎంసీ స్పందించింది. వీరికి అడ్డుకట్ట వేస్తూ బల్దియా కీలక నిర్ణయం తీసుకుంది. 14 డీసీఎం వాహనాలను అంతిమయాత్ర వాహనాలుగా మార్చారు. నగరంలోని 6 డివిజన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు మూడు రోజుల క్రితం చేశామని అధికారులు తెలిపారు. వాహనం కావల్సినవారు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేస్తే 15 నిముషాల్లో వాహనం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
స్మశానవాటికల్లో కూడా ధరలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాధారణ అంత్యక్రియలకు 6వేలు, కోవిడ్ అంత్యక్రియలకు 8వేలుగా నిర్ణయించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గతం కంటే భిన్నంగా మృతదేహాలు అంత్యక్రియలకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. దీంతో ఆంబులెన్సులు కొత్త దందాకు తెరలేపాయి. స్మశానవాటికల్లో కూడా అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ దందాకి అడ్డుకట్ట వేసినట్టైంది.
692378 582035This really is a fantastic web page, could you be interested in doing an interview about just how you created it? If so e-mail me! 65015
68493 780935You completed certain good points there. I did looking on the topic matter and identified most persons will go together with your blog 272539
872203 870602Hello! I merely want to make a enormous thumbs up with the fantastic information youve here during this post. We are returning to your weblog for additional soon. 544258