Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన సినిమాలతోనే కాదు సేవ కార్యక్రమాలతోనూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో ఉండి కొంతకాలం పాటు ప్రజాసేవ చేసిన ఆయన మళ్లీ సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. కష్టకాలంలో ఉన్న ఎంతోమంది అభిమానుల్ని, సాధారణ ప్రజల్ని చిరు ఎన్నోసార్లు ఆదుకున్నారు. చారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్ స్థాపించి పేదలకు బాసటగా నిలుస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. తాను చదివిన వైఎన్ కాలేజీకి చిరు రూ. 50 లక్షల సాయం చేశారట. ఈ విషయాన్ని ఆ కళాశాల కరస్పాండెంట్ సత్యనారాయణ స్వయంగా వెల్లడించారు.
‘కాలేజీ అభివృద్ధి కోసం చిరుని అడగ్గానే రూ.50 లక్షలు ఎంపీ నిధుల నుంచి కేటాయించారు. ఈ విషయం ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా కాలేజీ కోసం నిధులు కావాల్సి వస్తే తన సొంత డబ్బులే ఇస్తానని చిరు మాట ఇచ్చారు. హైదరాబాదులో జరిగిన వైఎన్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ లో ఆయన పాల్గొన్నారు. కాలేజీలో చదువుకున్న దాసరి నారాయణరావు( Dasari Narayana Rao), కృష్ణంరాజు( Krishnam Raju) కూడా చెరో రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ విషయం బయటకు రావడంతో చిరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంత పెద్ద సాయం చేసి ఎక్కడ బయటకి చెప్పుకోకపోవడం చిరు నిరాడంబరతకు నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. తండ్రి జాడలోనే చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చెర్రీ సతీమణి ఉపాసన కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.