సినిమాలు మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఆయన కీర్తిని పెంచుకుంటూ పోతున్నారు మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi). ఆపదలో ఉన్న చాలామందికి ఆయన చేయూత అందించారు. ఇప్పటికే ఆయన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించి పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. బ్లడ్ బ్యాంకును కూడా నిర్వహిస్తున్నారు.
తాజాగా ఆ బ్లడ్ బ్యాంక్ లో పనిచేస్తున్న లక్ష్మీబాయి అనే మహిళ ఆపదలో ఉన్నారని తెలుసుకున్న చిరు తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించారు. ట్రస్ట్ తరపున రూ. లక్ష రూపాయల చెక్ ను చిరు చెల్లెలు, బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి రాజ్ సదరు మహిళకి అందించారు.
చిన్నప్పుడు తను చదువుకున్న వైఎన్ కళాశాల అభివృద్ధికి చిరు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ విషయాన్ని ఆ కళాశాల కరస్పాండెంట్ సత్యనారాయణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.