భారతదేశ ఆర్ధిక ముఖచిత్రాన్ని 1991కి ముందు.. ఆతర్వాతగా చూడాల్సిందే. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణలే దేశానికి భవిష్యత్ బాటను నిర్మించాయి. ఆనాటి ఆర్ధికశాఖ మంత్రి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇందులో భాగస్వామి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 1991లో దేశం ఎదుర్కొన్న సంక్షోభం కంటే మరింత దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయని అన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశ ప్రజలకు మంచి భవిష్యత్ అందించాలంటే ప్రభుత్వం తన ప్రాధమ్యాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 30ఏళ్లలో వివిధ ప్రభుత్వాల కృషితో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించిందని అన్నారు. సుమారు 30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. యువతకు కోట్ల సంఖ్యలో ఉపాధి అవకాశాలు.. భారతీయ కంపెనీలకు వ్యాపారావకాశాలు పెరిగాయన్నారు. అయితే.. కరోనాతో పరిస్థితులు తారుమారైందన్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశం పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు.
775166 707029I besides believe therefore , perfectly composed post! . 281518
453240 675025Water-resistant our wales in advance of when numerous planking. The particular wales surely are a selection of heavy duty snowboards that this height ones would be the same in principle as a new shell planking having said that with considerably much more height to help you thrust outward within the evening planking. planking 875585