ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎంత గొప్పగా వుందో చెప్పడానికి, ఇటీవలి కాలంలో తరచూ ఉన్నత న్యాయస్థానం అధికారులకు శిక్ష విధిస్తుండడమే నిదర్శనం. అధికారుల అలసత్వానికి సవాలక్ష కారణాలుంటాయి. రాజకీయ ఒత్తిళ్ళే ఇందులో కీలక భూమిక పోషిస్తుంటాయ్నది నిర్వివాదాంశం.
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం దగ్గర్నుంచి.. కీలకమైన కేసుల్లో హైకోర్టు ఇచ్చే తీర్పుల్ని లెక్క చేయకపోవడం వరకు.. చాలా కేసుల్లో అధికారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. హైకోర్టు తీర్పుని పాటించాల్సి వస్తే.. అధికార పార్టీ నుంచి తలనొప్పులు తప్పవు. అధికార పార్టీ చెప్పింది చేస్తే, హైకోర్టు నుంచి చీవాట్లు తప్పవు. డీజీపీ, చీఫ్ సెక్రెటరీ స్థాయి అధికారులు సైతం న్యాయస్థానం నుంచి మొట్టికాయలు తినాల్సి వస్తోందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలోనూ కరోనా నేపథ్యంలో అధికారులు హైకోర్టు నుంచి మొట్టికాయలు తినక తప్పలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది సరికొత్త రికార్డ్. ఇది నెవర్ బిఫోర్.. ఎవర్ ఆప్టర్ ట్రెండ్. పదే పదే.. దాదాపుగా ప్రతిరోజూ అధికారుల్ని న్యాయస్థానాలు వాయించేయడం మీడియాలో చూస్తున్నాం. న్యాయస్థానం జైలు శిక్ష విధించడం, ఆ తర్వాత అధికారులు క్షమాపణ కోరడం.. దాంతో, జైలు శిక్ష తగ్గించి.. జరీమానాలతో సరిపెట్టడం.. ఇలా తయారయ్యింది వ్యవహారం.
నిజానికి, ఇది అధికారుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని.. అయినా, ఎందుకు అధికారుల్లో చలనం వుండటంలేదని రాజకీయ విశ్లేషకులు విస్మయం చెందుతున్నారు. అధికారులు స్వేచ్ఛగా పని చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదనీ, అధికార పార్టీ చేసే అడ్డగోలు పనులకు అధికారులు తలూపడంతోనే, న్యాయస్థానంలో వారికి చీవాట్లు తప్పడంలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
నిజానికి, పదే పదే అధికారులకు ఇలా చీవాట్లు పడుతున్నప్పుడు ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా, న్యాయస్థానాల తీర్పులు అమలయ్యేలా ప్రభుత్వ పెద్దలు హుందాగా వ్యవహరించాలి. కానీ, కోర్టులలానే చెబుతాయ్.. మేం చెప్పిందే చెయ్యాలన్నట్టు ప్రభుత్వాన్ని నడుపుతోన్న రాజకీయ వ్యవస్థ లైట్ తీసుకోవడంతోనే అధికారులిలా న్యాయస్థానాల్లో అను నిత్యం చీవాట్లు తినాల్సి వస్తోంది.
173575 94490youve got an crucial weblog correct here! would you wish to make some invite posts on my weblog? 141196
302904 878678I like the way you conduct your posts. Hmm 876553