Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘చరణ్, నేనూ చెన్నైలో కలిసే పెరిగాం. స్నేహానికి విలువిచ్చే మంచి వ్యక్తి. ఇన్నేళ్లయినా పాత స్నేహితులను మర్చిపోలేదు. దుబాయ్ లో ఒక పాపకి ఆపద వస్తే ఆదుకున్నాను. ఇంకా 5లక్షలు కావాలి. ఎవర్ని అడగాలో తెలీక అర్ధరాత్రి రామ్ చరణ్ కు ఫోన్ చేశా. నిముషంలో పంపించాడు. అదే చరణ్. కెరీర్లో చరణ్ మరింతగా రాణించాలని.. ప్రపంచంలోనే ప్రముఖ హీరోగా ఎదగాలని కోరుకుంటున్నా’.
‘మీ తండ్రుల మాదిరిగా కాకుండా మీరెలా స్నేహంగా ఉంటున్నారని కొందరు అడుగుతారు. భార్యభర్తల గొడవల మాదిరే చిరంజీవి (Chiranjeevi)-మోహన్ బాబు (Mohan Babu) గారివి. ఎవరూ వెళ్లకూడదు. 45ఏళ్ల స్నేహం వారిది. టామ్ అండ్ జెర్రీ మనస్తత్వాలు. అలుగుతారు.. కలుసుకుంటారు. మొత్తంగా.. The relationship between మెగా-మంచు families should be like fish and water.. not like fish and fisherman’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మనోజ్ వ్యాఖ్యలపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.