తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. మెదక్ జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరబాద్ మండలం కాళ్లకల్ మీదుగా పోచారం కాన్వాయ్ వెళ్తోంది. ఈక్రమంలో వేగంగగా వస్తున్న కాన్వాయ్ ను గమనించకుండా ఓ వ్యక్తి రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. దీంతో కాన్వాయ్ లోని ఓ వాహనం ఆ వ్యక్తిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతుడు నరసింహారెడ్డి (50)గా పోలీసులు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం కాళ్లకల్ గ్రామానికి వలస వచ్చి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఓ పరిశ్రమలో పని చేస్తూ జీవిస్తున్నాడు. వ్యక్తి మృతి చెందిన విషయం పోలీసులు అతడి బంధువులకు సమాచారం ఇచ్చారు.
793943 983011Excellent job on this write-up! I genuinely like how you presented your facts and how you produced it interesting and effortless to recognize. Thank you. 615251
466110 226391I surely didnt realize that. Learnt a thing new today! Thanks for that. 253985