టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈనేపథ్యంలో మల్లారెడ్డి సవాల్ పై స్పందించిన రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్ధల్లో అవకతవకలు ఉన్నట్టు ఆరోపించారు. దీనిపై మల్లారెడ్డి స్పందిస్తూ.. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచీ రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. టీడీపీలో మల్కజ్ గిరి టికెట్ తనకు ఇచ్చినప్పటి నుంచీ రేవంత్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు చెప్పారు.
తన విద్యాసంస్థల్లో అక్రమాలు జరగట్లేదని పార్లమెంట్ లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిందని అన్నారు. 2012లోనే తాను బాలికల కోసం అన్ని అనుమతులతో మెడికల్ కాలేజీని స్థాపించానని అన్నారు. రేవంత్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని అన్నారు. కాలేజీ హాస్టల్ లో దాదాపు 7వేల మంది అమ్మాయిలు ఉంటున్నారని అన్నారు. తన కళాశాలలు, ఆసుపత్రులకు సంబంధించి అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయని.. ఏవో కాగితాలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన సంస్థలను ఉన్నతంగా నడుపుతున్నట్టు మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.
506616 325240hi there, your web site is discount. Me thank you for do the job 811753