మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ఈనెలాఖరు వరకు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కేవలం నాలుగు నెల్లోనే ఆ సినిమాను పూర్తి చేయాలని పరశురామ్ కు ఇప్పటికే మహేష్ చెప్పాడని తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే కొత్త సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. రాజమౌళితో సినిమాకు కాస్త సమయం ఉండటంతో ఆ గ్యాప్ లో వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాను చేసేందుకు మహేష్ ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.
గత ఏడాది వెంకీ కుడుముల భీష్మ సినిమాతో సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఇటీవల మహేష్ బాబుకు వెంకీ ఒక కథను చెప్పారని తెలుస్తోంది. ఆ కథను కొరటాల శివతో కలిసి డెవలప్ చేయమంటూ మహేష్ సూచించాడట. మహేష్ బాబుతో ఉన్న సన్నిహిత్యం మరియు ఇతరత్ర కారనాల వల్ల కొరటాల శివ అందుకు ఓకే అన్నాడు. ప్రస్తుతం వెంకీతో కలిసి కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. కేవలం స్క్రిప్ట్ వర్క్ మాత్రమే కాకుండా షూటింగ్ సమయంలో కూడా ప్రతి సన్నివేశాన్ని కూడా పర్యవేక్షించే బాధ్యతను కొరటాల తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ కొరటాల కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్. కనుక వెంకీతో మహేష్ చేయబోతున్న సినిమాకు కొరటాల తెర వెనుక ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.
589165 423972Aw, this was a extremely nice post. In thought I wish to put in writing like this additionally – taking time and precise effort to make an superb article but what can I say I procrastinate alot and under no circumstances seem to get something done. 72443