మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అంటూ ఖైదీ నెం.150 సినిమాతో వెళ్లడి అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సైరా సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. అందుకే ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మెగాస్టార్ అంటూ అభిమానులు అంటూ ఉన్నారు. రీ ఎంట్రీ తర్వాత రెండు సినిమాలను చరణ్ సొంతంగా నిర్మించాడు కనుక పారితోషికం విషయం పెద్దగా చర్చకు రాలేదు. కాని ఆచార్య సినిమాను చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. కనుక పారితోషికం విషయంలో చర్చ జరుగుతోంది.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా కోసం దాదాపుగా 50 కోట్ల రూపాయల పారితోషికంను చిరు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ఈజీగా 150 కోట్ల బిజినెస్ చేస్తుందనే నమ్మకం ఉంది. అందుకే చిరంజీవికి అంత పారితోషికంకు ముందుకు వచ్చారు. దానికి తోడు కొరటాల శివ దర్శకత్వం అవ్వడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక ఆచార్య తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా వేదాళం రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాను అనీల్ సుంకర నిర్మించబోతున్నాడు.
ఈ సినిమాకు గాను చిరంజీవికి ఏకంగా 60 కోట్ల పారితోషికంను అనీల్ సుంకర ఇవ్వబోతున్నాడట. హీరోల పారితోషికాలు అమాంతం పెంచేస్తున్న నిర్మాతగా అనీల్ సుంకరకు మొదటి నుండి పేరు ఉంది. ఇప్పుడు దాన్ని మరోసారి సార్థకం చేసుకున్నాడు. మహేష్బాబు కంటే అధికంగా చిరంజీవి పారితోషికం అందుకోవడం పట్ల అంతా కూడా అవాక్కవుతున్నారు. వేదాళం రీమేక్కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్న నేపథ్యంలో ఒకింత అనుమానం ఉన్నాకూడా నిర్మాత అనీల్ మాత్రం రూ.60 కోట్లు ఇవ్వడం ఏంటీ అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
302713 608331In fact your creative writing abilities has encouraged me to get my own blog now. Actually the blogging is spreading its wings fast. Your write up is a great example of it. 196161
563784 365841Great article. I appreciate your attention to this topic and I learned a whole lot 83277