Switch to English

తిరుమల కొండపై కరోనా కలకలం.. బ్రహ్మోత్సవాలు జరిగేదెలా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంటే తిరుమల కొండ కిక్కిరిసిపోతుంది. దేశవ్యాప్తంగా భక్తులు కొండపైకి క్యూ కడతారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పడరాని పాట్లు పడుతుంది. అలాంటిది ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అధిక మాసం కారణంగా ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి ఓసారి బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. అక్టోబర్ 16న నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

అయితే, వీటి నిర్వహణ ఎలా అనే మీమాంస అందరినీ వేధిస్తోంది. ఇప్పటికే తిరుమల కొండపై కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే 743 మంది కరోనా బారిన పడగా.. ఓ అర్చకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 402 మంది కోలుకోగా.. మిగిలినవారు చెన్నై సహా పలు ఆస్పత్రులోల చికిత్స పొందుతున్నారు. టీటీడీలో దాదాపు 15వేల మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో 743 మందికి కరోనా సోకిందంటే చాలా తీవ్రమైన విషయంగానే భావించాలి. లాక్ డౌన్ కొనసాగినంత కాలం తిరుమల ఆలయాన్ని కూడా మూసివేశారు. ఆ సమయంలో అర్చకులు, ఇతర సిబ్బంది మినహా ఆలయంలో ఎవరూ లేరు.

కానీ పరిమిత స్థాయిలోనే అని దర్శనాలు ప్రారంభించిన తర్వాత నెమ్మదిగా కరోనా కేసులు కూడా పెరగడం ప్రారంభించాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. వారిలో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో గుర్తించడం సవాలే. ప్రస్తుతం కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులకు కూడా ఎలాంటి లక్షణాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అలా వచ్చే భక్తుల్లో ఎవరికైనా పాజిటివ్ ఉంటే వారి ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం సులభంగా ఉంది. దర్శనానికి వచ్చే భక్తుల విషయంలో తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ చెబుతున్నా.. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడటానికి కారణం లక్షణాలు లేకుండా పాజిటివ్ ఉన్న వ్యక్తులే అని చెబుతున్నారు.

ఇదే ఒరవడి కొనసాగి మరింతమంది టీటీడీ సిబ్బంది కరోనా బారిన పడితే బ్రహ్మోత్సవాల నిర్వహణ టీటీడీకి మరింత జఠిలంగా మారుతుంది. వాస్తవానికి గతంలో మాదిరిగా ప్రస్తుతం తిరుమలకు భక్తులు అంతగా రావడంలేదు. రోజుకు గరిష్టంగా 8వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు కూడా పరిమితంగానే భక్తులను అనుమతించే అవకాశం ఉంది. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలతో వీటిని నిర్వహించడం కత్తి మీద సామే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...