కొరటాల శివ రెండో సినిమా శ్రీమంతుడు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. అప్పటిదాకా డిస్ట్రిబ్యూషన్ కే పరిమితమైన ఈ సంస్థ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత కొరటాల శివతోనే ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ ను నిర్మించింది. అది కూడా సూపర్ హిట్టే. దీంతో కొరటాలపై మైత్రి వారికి గురి ఏర్పడింది. ఈ సంస్థకు మళ్ళీ ఇప్పటిదాకా కొరటాల సినిమా చేయకపోయినా ఆ సంస్థలో తెరకెక్కే సినిమాల కథలు వింటుంటాడని, దానిపై తన అభిప్రాయాలూ చెబుతాడని తెలుస్తోంది. మైత్రికి ప్రాజెక్టులు సెట్ చేయడంలో కూడా కొరటాల కీలక పాత్ర పోషిస్తుంటాడట.
మొదట సర్కారు వారి పాట కథ విని దాన్ని మైత్రి-మహేష్ ప్రాజెక్ట్ గా మార్చడంలో కొరటాల శివ పాత్ర చాలా ఉందని తెలుస్తోంది. మైత్రి మూవీస్ కు ఆ మధ్యన వరస ప్లాపులు చుట్టుముట్టాయి. కథల విషయంలో తప్పుల కారణంగానే ఇది జరిగిందని భావించిన నిర్మాతలు, అప్పటినుండి కొరటాల హెల్ప్ తీసుకుంటున్నారట.
ఇక ఇప్పుడు మైత్రి సంస్థలో భారీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఉప్పెన విడుదలకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ మొదలుపెట్టాలి. అలాగే మహేష్ బాబు సర్కారు వారి పాటను కూడా నిర్మించనున్నారు. వీటితో పాటే ఆచార్య తర్వాత కొరటాల చేయబోయే చిత్రం మైత్రి వారితోనే అని తెలుస్తోంది.
480071 426757As I web site owner I feel the topic material here is real great, appreciate it for your efforts. 42479
398823 168115There is noticeably a bundle to know about this. I assume you made certain good points in functions also 9027
391062 580805Visiting begin a business venture around the internet normally means exposing your products or services moreover provider not only to some individuals inside your town, but but to a great deal of future prospects who may be over the internet numerous times. straightforward internet business 579790