దేశంలో కరోనా రోజు రోజుకీ వికృతంగా మారుతోంది. ఈ మహమ్మారి ప్రజలను మరింతగా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రతిరోజూ పెరిగిపోతున్న కేసులే ఇందుకు ఉదాహరణ. ఏపీ రాష్ట్ర మంత్రి కుమారుడికి కరోనా వైరస్ సోకడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాసు కుమారుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ట్రూనాట్ పరీక్షల్లో కుమారుడికి పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో మంత్రి కూడా హోం క్వారంటైన్ కి వెళ్లిపోయారు.
ఇటివల మంత్రి తరపున ఆయన కుమారుడు ఆముదాలవలసలో వైఎస్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోనూ తండ్రి తరపున విస్తృతంగా పర్యటించారు. ఈనేపథ్యంలోనే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. మంత్రి కుమారుడు పాల్గొన్న వైఎస్ జయంతి కార్యక్రమంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈయనకు కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో స్పీకర్ తమ్మినేని హోం క్వారంటైన్కు వెళ్లారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను 15 రోజుల పాటు క్యాంపు కార్యాలయాలకు రావద్దంటూ ఇప్పటికే మంత్రి, స్పీకర్ సూచించారు.
మంత్రి కుమారుడికి పాజిటివ్ రావడంతో నియోజకవర్గంలోనూ, వైఎస్ జయంతి కార్యక్రమంలో ఆయనతో పాల్గొన్న కార్యకర్తలు భయాందోళనలకు గురవుతున్నారు. వీరితోపాటు పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి కూడా కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. దీంతో ఆమె కార్యాలయం మూసివేశారు. ఇలా ప్రజా ప్రతినిధులు కరోనా సోకడం, వారి కుటుంబాల్లో కరోనా బాధితులు ఉండటం కార్యకర్తలను ప్రజలను కలవరపెడుతోంది.
663046 44368articulo agregado a favoritos, lo imprimir cuando llegue a la oficina. 189509