ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. మహానటి తర్వాత మరిన్ని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు ఆమె వద్దకు వచ్చాయి. గత నెలలో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ విడుదలైన విషయం తెల్సిందే. టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం విజయవంతమైంది.
ఇక ప్రస్తుతం కీర్తి చేతిలో మరో రెండు విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఉన్నాయి. ఆమె నటించిన మిస్ ఇండియా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక మరో సినిమా గుడ్ లక్ సఖి కూడా షూటింగ్ దశలో ఉంది. ఇది కాకుండా నితిన్ సరసన రంగ్ దే లో నటిస్తోంది. అంతే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇవి కాకుండా తమిళ సినిమాలు ఉండనే ఉన్నాయి.
ఇలా వరస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ మరో చిత్రాన్ని ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాత తరం క్లాసిక్ ఎర్ర గులాబీలు గుర్తుందా. 40 ఏళ్ల క్రితం ఈ చిత్రం విడుదలైంది. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన భారతి రాజా ఇప్పుడు దానికి సీక్వెల్ కు కథ రాస్తున్నాడు. ఆయన కొడుకు మనోజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను అప్రోచ్ అయ్యారట. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాలి.
946246 810627You wouldnt feel it but Ive wasted all day digging for some articles about this. You might be a lifesaver, it was an outstanding read and has helped me out to no end. Cheers! 927425
341362 496728The vacation particular deals offered are believed as a selection of possibly the most preferred and therefore within your budget all more than the globe. Quite several hostels can be proudly located inside property which is accented who has striking seashores encouraging crystal-clear rivers, contingency of an Ocean. hotels compare rates 677990