‘మావైపు సత్యం, ధర్మం, న్యాయం ఉన్నాయి. ఎటువంటి విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం.. రాష్ట్రాల ఎన్నికల ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానం.. ఈక్రమంలోనే మా పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘దేశంలో 27ఏళ్లుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో దీనిపై బీజేపీ హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేర్చలేదు. మార్చి 10న ఢిల్లీలో దీక్ష చేస్తామని 2న ప్రకటిస్తే.. 9న విచారణకు రావాలని ఈడీ నోటీసులిచ్చింది. 11న విచారణకు వస్తానని చెప్పినా 9నే రావాలని నోటీసులిచ్చింది’.
‘మహిళలను ఇంటికొచ్చి విచారించాలని చట్టం చెప్తున్నా.. ఇందుకు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తోంది. బీజేపీని విమర్శించామని మా పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దేనికీ భయపడేది లేదు’ అని అన్నారు.
73299 556203Youre so cool! I dont suppose Ive read anything in this way before. So nice to uncover somebody with some original concepts on this topic. realy appreciate starting this up. this excellent site is something that is necessary more than the internet, a person if we do originality. valuable function for bringing something new towards the internet! 29113