కాపు సామాజిక వర్గానికి ఇస్తామని చెప్పిన రిజర్వేషన్లను ఎప్పుడిస్తారు.? కాపు నేస్తం పేరుతో కాపు సామాజిక వర్గంలో ఎంతమందికి న్యాయం చేస్తున్నారు.? కాపు సామాజిక వర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎంతవరకు నెరవేర్చారు.? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి కూడా నచ్చడంలేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘కాపు ముద్ర’ వేసేయడంలో టీడీపీ, వైసీపీ పోటీ పడుతున్నాయి. అదే సమయంలో ‘కాపు ద్రోహి’ అని కూడా ఇవే పార్టీలు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తుండడం మరింత విడ్డూరంగా చెప్పుకోవాలేమో. చంద్రబాబు హయాంలో కాపులు అణచివేతకు గురైతే జనసేన అధినేత ఎందుకు స్పందించలేదు.? అని వైసీపీ విమర్శిస్తోంది.
పోనీ, టీడీపీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి బాసటగా నిలుస్తోందా.? అంటే అదీ లేదు. ‘పవన్ కళ్యాణ్ నిజస్వరూపం బయటపడిపోయింది.. ఆయన ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే..’ అంటున్నారు కొందరు టీడీపీ నేతలు. నేతలు చేస్తున్న కామెంట్స్ ఓ ఎత్తు, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం ఇంకో ఎత్తు.!
నిజానికి, జనసేన అధినేత పవన్కళ్యాణ్, ప్రస్తుతం అధికారంలో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పురోహితుల గురించి నినదించారు. దళితుల గురించి మాట్లాడుతున్నారు. ఫలానా కులం, ఫలానా మతం.. అని కాకుండా, అన్ని సమస్యలపైనా ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ, ‘కాపు సామాజిక వర్గానికి సంబంధించి’ జనసేనాని ఎప్పుడు మాట్లాడినా, ఆయన్ని ‘కాపు’ నేతలతో తిట్టించడం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిపోయింది.
గతంలో టీడీపీ కూడా ఇలానే చేసింది. కాపు సామాజిక వర్గానికి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో గొప్ప మేలు జరిగిపోయి వుంటే, ‘మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో..’ అని ఇప్పుడు ఆ సామాజిక వర్గం నినదించాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. చంద్రబాబు గొప్పగా చేసేసి వున్నా.. ఆ పరిస్థితి వుండేది కాదు. వైఎస్ జగన్ హయాంలోనూ అదే జరుగుతోంది. చంద్రబాబు హయాంలో ‘కమ్మ’ సామాజిక వర్గానికే అత్యున్నత పదవులు దక్కాయి. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో ‘రెడ్డి’ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్న వైనం గురించి ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజే చెబుతున్నారాయె. మరి, ఈ రెండు పార్టీలూ కాపు సామాజిక వర్గాన్ని ఉద్ధరించేశయనుకుంటే ఎలా.? పైగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని జనసేన అధినేత, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వైసీపీతోపాటు, టీడీపీకి కూడా ఎందుకు కంగారు పుట్టుకొస్తోందో మరి.! దీన్నే కదా, ‘60-40’ చీకటి ఒప్పందాల వ్యవహారమనేది.!
333706 228244Disgrace on the search Google for now not positioning this publish higher! Come on over and talk over with my website. 905122