దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న కారణంగా వేడుకలు పండుగలను ప్రభుత్వం నిషేదించింది. పెళ్లికి 30 నుండి 50 మందిని మాత్రమే అనుమతిస్తుంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో అసలు ఎలాంటి వేడుకలు ఈ సమయంలో నిర్వహించకుండా ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్కు చెందిన గీసులాల్ లాఠీ అనే వ్యక్తి తన కొడుకు వివాహాన్ని ఈనెల 13న వైభవంగా నిర్వహించాడు. భారీ ఎత్తున బంధువులు మిత్రులు పెళ్లికి హాజరు అయ్యారు.
పెళ్లి అయిన వారం రోజుల తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గొన్న 15 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. వారిలో ఒకరు మృతి చెందినట్లుగా కూడా అధికారులు ప్రకటించారు. పెళ్లి వల్ల కరోనా బారిన పడ్డ వారికి చికిత్స అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 6.26 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందట. వారి చికిత్స మరియు వారికి అందించిన పౌష్టిక ఆహారంకు అయిన ఖర్చును పెళ్లి పెద్ద అయిన గీసులాల్ లాఠీ నుండి వసూళ్లు చేయాలని అధికారులు భావించారు.
అతడు బాధ్యత వహించి ఆ సొమ్మును సీఎం సహాయ నిధికి చెల్లించాల్సిందే అంటూ కలెక్టర్ ఆదేశించాడు. దేశంలో మొదటి కరోనా జరిమానాగా ఇది రికార్డు సాధించింది. ముందు ముందు కూడా దేశ వ్యాప్తంగా ఇలాంటి జరిమానాలు విధించాలంటూ జనాలు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే వేడుకలు భారీగా జరుగవని, కేసులు కాస్త అయినా తగ్గుతాయని అంటారు.
356601 876431What a lovely blog page. I will surely be back once again. Please maintain writing! 664246