జనసేన కౌలు రైతు భరోసా యాత్రతో జనంలోకి జనసేనాని పవన్ కళ్యాణ్ ‘బలంగా’ వెళ్ళారన్నది నిర్వివాదాంశం. తాజాగా జనవాణి కార్యక్రమంతో మరింతగా జనాల్లో పవన్ కళ్యాణ్ గురించీ, జనసేన పార్టీ గురించీ చర్చ జరుగుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీని సంప్రదిస్తున్న సామాన్యుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
స్వయంగా జనసేనాని రంగంలోకి దిగి, వైసీపీ బాధిత ప్రజానీకం తన వద్దకు తీసుకొస్తోన్న సమస్యల గురించి తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోన్న వైనం.. జనాల్లోకి బలమైన ‘సంకేతాన్ని’ పంపుతోంది. అధికారంలో వైసీపీ వుంది. ఆ వైసీపీ పీడిత ప్రజానీకం తన వద్దకు తీసుకొచ్చే సమస్యల్ని పవన్ కళ్యాణ్ ఎలా పరిష్కరించగలరు.? అన్న డౌట్ చాలామందికి వుండడం పెద్ద వింతేమీ కాదు.
అయితే, జనసేనాని ఎంచుకున్న వ్యూహం చాలా చాలా ప్రత్యేకమైనది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెందిన 87 ఏళ్ళ వృద్ధురాలికి సంబంధించిన సమస్యపై జనసేనాని పవన్ కళ్యాణ్, బాధిత మహిళ నుంచి ఫిర్యాదు అందుకున్నారు. దాంతో, ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ అనుకూల మీడియా నానా తంటాలూ పడింది. తిమ్మిని బమ్మిని చేసి చూసేందుకు బులుగు మీడియా పడ్డ పాట్లు కావు. అధికార యంత్రాంగం కూడా ఈ విషయంలో కిందా మీదా పడుతోంది.
ఈ క్రమంలో ఈ అంశాన్ని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్ళేందుకు స్థానిక జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారు. వెరసి, అధికార పార్టీ పడుతున్న ఆపసోపాలు కాస్తా బయటపడిపోయాయి. సరే, అధికార పార్టీ తనదైన బుకాయింపులతో 87 ఏళ్ళ వృద్ధురాలి విషయంలోనూ తనదైన రాజకీయం చేస్తుందనుకోండి.. అది వేరే సంగతి.
కానీ, ‘వైసీపీ పాలనలో అరాచకాలు..’ అంటూ జనసేన వినిపిస్తోన్న వాదనకు ప్రజల నుంచి బలం చేకూరుతుంది. అదే సమయంలో బాధితురాలి సమస్య అధికార పార్టీ మెడకు ఉరితాడులా చుట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. షన్ముఖ వ్యూహం.. అని మొన్నామధ్య జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అందులో ఒకటి, ఈ జనవాణి కార్యక్రమం.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
221284 422430They call it the self-censor, basically because youre too self-conscious of your writing, too judgmental. 663770