‘జనసేన పార్టీకి ఒక్క అవకాశమిచ్చి చూడండి.. అవినీతి రహిత పరిపాలన అంటే ఏంటో చూపిస్తాం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లాకి వెళుతూ ప్రజల్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోడీతో ఇటీవల విశాఖలో భేటీ అయిన పవన్ కళ్యాణ్, ‘రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయ్..’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఆయన విజయనగరం జిల్లా వెళుతూ, ‘మేం అధికారంలోకి వస్తాం..’ అని చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
మిత్రపక్షం బీజేపీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లైట్ తీసుకున్నారా.? ప్రధాని మోడీతో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ఆలోచన’ మారిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే, ‘మేమింకా మిత్రపక్షం బీజేపీతోనే కలిసి వున్నాం..’ అని అంటోంది జనసేన పార్టీ. బీజేపీది కూడా ఇదే వాదన.
టీడీపీతో కలిసే ఉద్దేశ్యం జనసేన పార్టీకి వుంటే, ‘మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..’ అని జనసేన అధినేత రాష్ట్ర ప్రజల్ని కోరే అవకాశం వుండదు. సో, తెలుగుదేశం పార్టీతో కలవాలన్న ఆలోచన కూడా జనసేన అధినేతకు వున్నట్లు కనిపించడంలేదన్నమాట.
‘రోడ్ మ్యాప్’ విషయమై జనసేన అధినేత పదే పదే బీజేపీ మీద ఒత్తిడి తెస్తున్నారు. అయితే, బీజేపీ మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకుంటోంది. వాస్తవానికి బీజేపీతో కలవడం వల్ల జనసేనకు వచ్చే అదనపు లాభమేమీ లేదు. టీడీపీలో కలిసినా అదే పరిస్థితి.
టీడీపీ అయినా బీజేపీ అయినా.. జనసేనతో కలవడం లాభం పొందుతాయంతే. పొత్తులంటే ఇరు పక్షాలకూ లాభం వుండాలి. కానీ, జనసేన వల్ల లాభపడుతున్న బీజేపీ, జనసేనకు మాత్రం ఉపయోగకరంగా మారడంలేదు. ఇవన్నీ బేరీజు వేసుకున్నాకే జనసేనాని ఒంటరి పోరు వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే, బీజేపీతో పూర్తిగా బంధాన్ని తెంచేసుకోవాలని జనసేనాని అనుకోవడంలేదు. ‘మేమే అధికారంలోకి వస్తాం..’ అని గట్టిగా చెప్పడం ద్వారా, బీజేపీకీ అలాగే టీడీపీకీ జనసేనాని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ‘మాకు మీ వల్ల ఏదైనా లాభముంటేనే, మీతో కలుస్తాం.. మీకు లాభం చేకూర్చడానికి కాదు..’ అన్నదే ఆ సంకేతాల సారాంశం.
282740 827842You created some decent points there. I looked online for that difficulty and found a lot of people goes coupled with with all your web site. 358179
404652 561606I like you blog (dsol, je suis francais, je parle mal anglais) 183276
280565 617607hello!,I really like your writing so so much! 137900