జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్లో తమకు రాజకీయ ప్రత్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చాలా సీరియస్ కోణంలో చూస్తున్నట్టుంది. తెలుగుదేశం పార్టీని జనసేన ఎందుకు విమర్శించడంలేదు.? అని వైఎస్సార్సీపీ నేతలు గొంతు చించుకుంటున్నా.. జనసేన మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. నిజానికి, ‘ఆ ఇద్దరు తోడు దొంగలు..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చంద్రబాబునీ, వైఎస్ జగన్నీ విమర్శించారు.. విమర్శిస్తూనే వున్నారు.
ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలో వుంది గనుక, జనసేనకు స్ట్రెయిట్ టార్గెట్ ఆ పార్టీనే అవుతోంది. అయితే, టీడీపీ – జనసేన మధ్య లోపాయకారీ ఒప్పందాలున్నాయన్న విమర్శలు వైఎస్సార్సీపీ నుంచి గట్టిగానే విన్పిస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం. ఇసుక కొరతపై పోరాటం, తెలుగు మీడియం విషయమై అధికార పార్టీపై ఒత్తిడి పెంచడం.. ఇలా ఇప్పటికే జగన్ సర్కార్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న జనసేన, ”దేశ ప్రతిష్ట దిగజారుస్తున్న జ’ఘనుడు’..” అనే కొత్త నినాదంతో ముందుకొచ్చింది.
జాతీయ గీతాన్ని అగౌరవపరచడం.. జాతీయ జెండాకి రంగులేయడం.. దేశం గర్వించే వ్యక్తుల్ని అవమానించడం.. దేశాన్ని కోర్టుకు లాగడం.. పెట్టుబడులు రాకుండా చేయడం.. వెరసి జగన్ పాలన దేశానికే వేదన..’ అంటూ జనసేన కొత్త నినాదాన్ని ఎత్తుకుంది.
ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ వ్యవహారం సహా, అనేక అంశాలకు సంబంధించి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోతోందంటే, దానికి కారణం జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలే. ఇటీవల లులు గ్రూప్కి భూ కేటాయింపుల్ని రద్దు చేయడంతో.. వ్యవహారం ముదిరి పాకాన పడింది.
గత ఒప్పందాల్ని గౌరవించడంలేదంటూ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్పై ఆయా సంస్థలు గుస్సా అవుతున్నాయి. ఇది దేశంలో పెట్టుబడులపై విపరీత ప్రభావం చూపించే అవకాశాల్లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే, ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ కోర్టుకు లాగేందుకు ఆయా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అదే గనుక జరిగితే.. రాష్ట్రానికి తీవ్ర ఇబ్బందులు తప్పవు.
ఇదే విషయమై ఇప్పుడు ఇంటా బయటా పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది. కేంద్రం ఈ విషయాలపై జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్, కేంద్రానికి తాజా పరిణామాలపై నివేదిక ఇచ్చారంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.
249261 584231I like this post, enjoyed this one thanks for posting . 506707