Switch to English

‘కవాతు’ వేగం పెంచుతున్న జనసైన్యం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ ఎక్కడుంది.? ఏం చేస్తోంది.? అన్న చర్చ తప్ప, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కూడా జనసేన నేతలు, కార్యకర్తలు జనంలోనే వున్నారన్న వాస్తవాన్ని దాదాపుగా తెలుగు మీడియాలో ప్రధాన ఛానళ్ళు ఏవీ కవర్‌ చేయలేదు. పోలింగ్‌ ముగిసిన తర్వాతి నుంచీ యధాతథంగా జనసేన కార్యకర్తలు జనంలోనే వున్నారు. తమవంతుగా ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రమిస్తున్నారు. నేతలు, తాము చెయ్యగలిగింది చేస్తూనే వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొంత నిరాశ చెందినా, తమ పని మాత్రం మానుకోలేదు.

పార్టీ వేదికలపై ఫలితాల గురించిన చర్చ ఓ పక్క జరుగుతుంటే, ఇంకోపక్క కార్యకర్తలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అధిష్టానానికి నివేదికలు కూడా ఇస్తున్నారు. తాజాగా, జనసేనాని పవన్‌కళ్యాణ్‌, జిల్లాల వారీగా సమీక్షలు ప్రారంభించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.

కాగా, కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన జనసేన నేత అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ), జనసైనికులతో నియోజకవర్గ సమావేశ్నా ప్లాన్‌ చేశారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం కొండపల్లి గ్రామంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుంది. పార్టీ బలోపేతంపై నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు తమ తమ సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానం పలికారు గాంధీ. గ్రామ స్థాయి, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది.

ఒక్క మైలవరంలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ అంతటా నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలకు జనసైనికులు సమాయత్తమవుతున్నారు. జనసేన అధినేత నిర్ణయం మేరకు గ్రామ స్థాయి నుంచీ పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టామని జనసేన నేతలు పేర్కొన్నారు. ఓటమి, గెలుపుకి తొలి మెట్టు..జనసేన మలి అడుగు చాలా గట్టిగా పడబోతోంది. ఓట్లు, సీట్లు గెలవడమొక్కటే జనసేన లక్ష్యం కాదు, ప్రజల మనసుల్ని గెలవడం, రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావడమే జనసేన లక్ష్యమని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు. మొత్తమ్మీద, జన సైనికుల కవాతులో ఇప్పుడిప్పుడే మరింత వేగం పుంజుకుంటోందన్నమాట.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...