Jahnavi: అమెరికా (America) లో జరిగిన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి (Jahnavi) కందుల మృతి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జనవరి 2023లో సియాటెల్ పోలీసు అధికారి కెవిన్ డవే పోలీసు పెట్రోలింగ్ వాహనంతో జాహ్నవిని ఢీకొట్టింది. ఘటనపై మరో పోలీసు డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడిన ఆడియో కలకలం రేపింది.
కేసులో కెవిన్ డవేపై సాక్షాధారాలు లేకపోవడంతో అతనిపై నేరాభియోగాలు మోపడంలేదని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం వెల్లడించింది. జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడిన డేనియల్ అడెరెర్ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడలేడని కూడా తెలిపింది. అయితే.. అతను అలా వ్యాఖ్యానించడం సరైనది కాదని వ్యాఖ్యానించింది. ప్రజలకు పోలీసులపై ఉన్న విశ్వాసం తగ్గించేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది.
అడెరెర్ పై తీసుకునే క్రమశిక్షణా చర్యల ప్రభావం డవేపై అభియోగాలు మోపడంపై ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే అడెరర్ సస్పెన్షన్ లో ఉన్నాడని గుర్తు చేసింది. అడెరర్ పై తీసుకునే చర్యల తుది విచారణ మార్చి 4న కోర్టు ముందుకు రానుంది.