ముఖ్యమంత్రి అనాల్సిన మాటలేనా అవి.? ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపై కులం ముద్ర వేయడమా.? అది కూడా ఎన్నికల కమిషనర్ మీద. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్కుమార్పై ‘కులం ముద్ర’ వేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
‘సంబంధిత కార్యదర్శికి కూడా తెలియకుండా ప్రకటన చేశారు.. ఎవడో రాసిస్తే, దాన్ని ఈయన చదివారు.. చంద్రబాబు హయాంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన రమేష్కుమార్ని నియమించారు.. ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నారా.?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
ఎన్నికల వేళ, ఆరోపణలు వచ్చిన పోలీస్ అధికారులపైనా, ఇతర అధికారులపైనా రాష్ట్ర ఎన్నికల సంఘం కావొచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావొచ్చు స్పందించడం మామూలే. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి చీఫ్ సెక్రెటరీ అనిల్ చంద్ర పునేటాపై వేటు పడింది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపైనా వేటు పడింది. అది వైసీపీ ఆరోపణల నేపథ్యంలోనే జరిగింది. అప్పుడు అది రైటు.. కానీ, ఇప్పుడది వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఘోర తప్పిదంగా కన్పిస్తోంది.
పైగా, అధికారుల మీద కులం ముద్ర వేయడం. సాక్షాత్తూ ముఖ్యమంత్రే, అధికారుల మీద కులం ముద్ర వేసే.. వ్యవస్థలు నడిచేదెలా.? అన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. వైఎస్ జగన్ చెబుతున్నదాన్నిబట్టి ‘నిమ్మగడ్డ రమేష్కుమార్’ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారుల మాటేమిటి.? వాళ్ళంతా అధికార వైసీపీ చెప్పు చేతల్లో నడుస్తున్నారా.? ఇతర కులాలకు చెందిన అధికారుల గురించి ఏమనుకోవాలి.?
కులాల కుంపట్లు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో రాజేసుకున్నాయి.. ఎవరికి తోచిన తీరున వారు బడబాగ్నిని రగల్చుకుంటూ పోతున్నారంతే.. ఈ క్రమంలో వైఎస్ జగన్ పేల్చిన ‘కులం బాంబు’ రాష్ట్రంలో అందర్నీ మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
903340 460747I definitely did not realize that. Learnt something new nowadays! Thanks for that. 203041
893240 776283 You made some decent points there. I looked on the internet for the issue and identified most individuals will go along with along with your web site. 156564