ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈనెలాఖరున ఎంపిటిసి, జెడ్పిటిసి, మున్సిపల్, కార్పొరేషన్, పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. అయితే, దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ రావడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా ప్రకటించడం కూడా ఈ ఎన్నికలపై ప్రభావం చూపినట్టుగా ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.
ఆరువారాల తరువాత అప్పటి పరిస్థితిని సమీక్షించి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేయడం లేదని, కేవలం ఎన్నికలను వాయిదా వేస్తున్నామని ఎన్నికల కమిషన్ పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఎంపికైన వ్యక్తులు కొనసాగుతారని, ఎన్నికల నిర్వహించాల్సిన వాటిని ఆరువారాల తరువాత నిర్వహిస్తామని చెప్పారు. పంచాయితీ ఎన్నికలకు ఆరు వారాల తరువాతే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.
ఇక రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ సమయంలో జరిగిన అవాంతరాలు, ఇబ్బందులు ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చినట్టు చెప్పారు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొత్తానికి ఎన్నికలు వాయిదా పడటంతో ప్రతిపక్షాలకు ఖుషి అవుతున్నాయి. ఎన్నికల కోడ్ ఈ ఆరువారాల పాటు అమలులోనే ఉంటుందని ఎన్నికల కమిషన్ చెప్పడంతో అధికార పార్టీకి కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది.
298680 394466They call it the self-censor, simply because youre too self-conscious of your writing, too judgmental. 156902
606121 118973Hmm is anyone else experiencing difficulties with the images on this blog loading? Im trying to uncover out if its a difficulty on my finish or if its the weblog. Any responses would be greatly appreciated. 92277
930363 903384Some truly good stuff on this internet website , I enjoy it. 640342