కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు కోల్పోయి అనాధలవుతున్న పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా వారి పేరిట 10లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆ మొత్తంపై వచ్చే ఆదాయం ద్వారా పిల్లల పోషణ జరిగేలా చూడాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు వీలైనంత త్వరగా మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.
బ్యాంకులతో సంప్రదించి పిల్లల పేరుతో ఈ ఫిక్సిడ్ డిపాజిట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమొత్తంపై వచ్చే వడ్డీని పిల్లల బాధ్యత తీసుకున్న గార్డియన్ కు వచ్చేలా చూడాలని ఆదేశించారు. 25 ఏళ్లవరకూ వారికి ఈ మొత్తం భరోసాగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో అనాధలైన పిల్లలకు భరోసా దక్కినట్టే. రోడ్డున పడకుండా కాస్తంత భరోసా వస్తుందని చెప్పాలి.