హైదరాబాద్ లోని ప్రముఖ అల్పాహార హోటల్ సంస్థ ‘చట్నీస్’ పై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు చేశారు. భాగ్యనగరం వ్యాప్తంగా ‘చట్నీస్’ హోటల్ కి ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. ఈ సంస్థ అధినేత అట్లూరి పద్మ, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కి వియ్యంకురాలన్న విషయం తెలిసిందే.
ఇటీవల అట్లూరి పద్మ కుమార్తె ప్రియ కి, షర్మిల కుమారుడు రాజారెడ్డితో వివాహం జరిగింది. ఇక పదేళ్ల క్రితం ప్రారంభమైన ‘చట్నీస్’ ఎంతో ప్రాచుర్యం పొంది దేశవ్యాప్తంగా విస్తరించింది. తాజాగా ఈ సంస్థ పై ఐటి దాడులు జరగడం హాట్ టాపిక్ గా మారింది. హోటల్స్ తో పాటు అట్లూరి పద్మా నివాసంలోను అధికారులు సోదాలు చేశారు.
ఈ దాడులపై అటు ఐటీ అధికారులు కానీ ఇటు ‘చట్నీస్’ హోటల్ యాజమాన్యం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు మేఘన ఫుడ్స్ అండ్ ఈటరీస్ సంస్థ పైనా ఐటీ దాడులు జరిగాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ దాడులు సంచలనంగా మారాయి.