తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణం ఇటీవలే పూర్తి అయ్యింది. దానిని కోవిడ్ వార్డుగా వినియోగించేందుకు వైధ్యలు నిర్ణయించుకుని దాన్ని కోవిడ్ వార్డుగా పేర్కొన్ని అక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే భవన నిర్మాణంలో లోపాలు ఉన్న కారణంగా పెచ్చులు ఊడి పడ్డాయి. నిన్న రాత్రి సమయంలో పెచ్చులు ఊడి పడి అటెండర్ రాధిక పై పడ్డాయి. దాంతో ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు సిబ్బంది కూడా గాయాల పాలయ్యారు. కరోనా రోగులు కూడా ఈ ప్రమాదంలో గాయ పడ్డట్లుగా తెలుస్తోంది.
గాయ పడ్డ వారిని అదే ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఏడాది కూడా కాకుండానే భవనం పెచ్చులు ఊడి పడుతుండటం పట్ల జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయమై స్పందించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ అటెండర్ రాధిక మృతి చెందడంపై ఆసుపత్రి వర్గాల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఆదుకుంటామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో భవనం నిర్మించిన కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.
769657 415561Das beste Webdesign Berlin erhalten Sie bei uns, genauso wie professionelles Webdesign. Denn wir sind die Webdesign Agentur mit pfiff. 103803