ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటివల రాష్ట్ర హైకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వాహణకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశామని మంత్రి అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కోర్టు అభిప్రాయాలు, పిల్లలు, తల్లిదండ్రుల అభిప్రాయాలను బాధ్యతాయుత ప్రభుత్వంగా పరిగణలోకి తీసుకున్నామన్నారు.
పిల్లల భవిష్యత్తు మీద మమకారం, వారి ప్రాణాల మీద ప్రేమ, బాధ్యత ఉన్న ప్రభుత్వంగా విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి అన్నారు. సురక్షిత వాతావరణంలోనే పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ కారణంగానే ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహించే తేదీలు వెల్లడిస్తామని మంత్రి సురేశ్ ఈ సందర్భంగా తెలిపారు.
170153 850306very good post, i really adore this web site, keep on it 115282