సోషల్ మీడియా పరిచయం ప్రేమగా దారి తీసి ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్లి ఎన్నో జీవితాలు నాశనం అయిన సంఘటనలు మీడియాలో చూసి కూడా కొందరు అదే విధంగా మోసపోతూనే ఉన్నారు. మరో ప్రేమ పెళ్లి ఆత్మహ్య సంఘటన హైదరాబాద్ లో జరిగింది. మీర్పేట్ కు చెందిన 20 ఏళ్ల ఐశ్వర్యకు మియాపూర్ కు చెందిన 21 ఏళ్ల అశిర్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. గత ఏడాది పెళ్లి కూడా చేసుకుని ఖైరతాబాద్ లో ఫ్యామిలీ పెట్టారు. పరిణతి చెందని వీరి వయసు వారి వైవాహిక జీవితంలో గొడవలకు తారి తీసింది. తమది ప్రేమ కాదు కేవలం అట్రాక్షన్ అని తెలుసుకున్నారు. అశిర్ కొన్నాళ్లుగా ఐశ్వర్యకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ప్రేమ పేరుతో తాను మోసపోయాను అని గ్రహించిన ఐశ్వర్య తట్టుకోలేక పోయింది. గత కొన్ని రోజులుగా హాస్టల్ లో ఉంటున్న ఆమె ఎవరు లేని సమయం చూసి తండ్రికి సోదరుడికి మరియు భర్తకు వీడియో మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఐశ్వర్య ఆత్మహత్య చేసుకునే ముందు తాను మోసపోయాను అంటూ కన్నీరు మున్నీరు అయ్యింది. తప్పు చేశాను శిక్ష అనుభవిస్తాను అంటూ ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అశిర్ మరియు అతడి కుటుంబ సభ్యులపై ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
706987 583742Speedily and easily build your web traffic and PR, which provides Web internet site visitors to add your page to any social bookmarking web site. 729241