‘2024 ఎన్నికల్లో బీజేపీ – జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ముఖ్యమంత్రి ఎవరన్నది అప్పటి సమయాన్ని బట్టి రెండు పార్టీలూ కలిసి నిర్ణయం తీసుకుంటాయి. పవన్ కళ్యాణ్ ఛరిష్మా వున్న నాయకుడు. జనసేన పార్టీ ఓ సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయాలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ కూడా అంతే. పవన్ కళ్యాణ్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది. పవన్ కళ్యాణ్ నన్ను సోమరాజు.. అని పిలుస్తారు..’ అంటూ జనసేనతో బీజేపీ పొత్తు గురించీ, జనసేనాని పవన్తో తన దోస్తీ గురించీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
‘టీడీపీతో మళ్ళీ కలిసి పనిచేసే అవకాశముందా.?’ అన్న ప్రశ్నకు, ‘అది బీజేపీ అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ, టీడీపీ కారణంగానే మేం నష్టపోయామన్న విషయాన్ని మేమెప్పటికీ విస్మరించలేం. మా వల్లే టీడీపీ 2014 ఎన్నికల్లో అధికారం దక్కించుకుంది..’ అని సమాధానమిచ్చారు సోము వీర్రాజు.
‘టీడీపీ మమ్మల్ని మోసం చేసింది. 2014లో పుంజుకుని, 2019లో మేం బలహీనమవడానికి కారణం టీడీపీనే. కాబట్టి, టీడీపీతో మళ్ళీ కలిసి పనిచేస్తామనే నమ్మకం నాకు లేదు..’ అని చెప్పారాయన. ఇంతకీ, ‘టీడీపీ – బీజేపీ’ మధ్య స్నేహం అంతలా ఎందుకు చెడింది.? అంటే, దానికి బలమైన కారణాలే వున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేసి, కేంద్రంలో – రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్న విషయం విదితమే. ఓ దశలో కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సమర్థించిన టీడీపీ అధినేత చంద్రబాబు, వ్యూహాత్మకంగా బీజేపీని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.
‘నేనే గొప్ప..’ అనే భ్రమల్లో, ప్రధాని నరేంద్ర మోడీని తూలనాడారు. ఇక్కడే బీజేపీ పెద్దల అహం దెబ్బతింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఎవరూ వుండరన్నది నిజమేగానీ.. చంద్రబాబు నిజస్వరూపాన్ని చూసిన బీజేపీ పెద్దలు, చంద్రబాబునీ, టీడీపీని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు కన్పిస్తోంది. లేకపోతే, రాష్ట్రంలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుల్ని తమవైపుకు లాక్కోవడమేంటి.? ఓ ప్రతిపక్షాన్ని ఇంకో విపక్షం దెబ్బకొడితే.. అది అధికార పార్టీకే లాభం కదా.! ‘వైసీపీని ఎంకరేజ్ చేసినా తప్పులేదు.. టీడీపీని మాత్రం ఎదగనీయకూడదు..’ అన్న భావనకి వచ్చేసింది బీజేపీ. పైగా, టీడీపీని నిర్వీర్యం చేస్తే.. వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అవుతామన్న ఆలోచనతోనే బీజేపీ, టీడీపీకి షాక్ ఇవ్వడం మొదలు పెట్టింది.
మరోపక్క, చంద్రబాబు తన తప్పుని తెలుసుకుని, బీజేపీ పంచన చేరేందుకు నానా తంటాలూ పడుతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఏమో.. చంద్రబాబు ఎలాగైనా మారగలరు.! అదే సమయంలో టీడీపీకి ప్రస్తుతం వున్న 38 శాతం ఓటు బ్యాంకు పట్ల బీజేపీ కూడా కాస్త సానుకూలంగా ఆలోచించే అవకాశం లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ‘టీడీపీతోగానీ, వైసీపీతోగానీ ఎలాంటి సంబంధాలూ పెట్టుకోం..’ అని ఇప్పటికే బీజేపీ, జనసేన సంయుక్తంగా పలుమార్లు ప్రకటించిన దరిమిలా, రాష్ట్రంలో 2024 నాటికి రాజకీయ సమీకరణాలు మారతాయా.? వేచి చూడాల్సిందే.
593552 793959I saw a great deal of web site but I feel this one contains something unique in it in it 834461
372909 638376Oh my goodness! an amazing write-up dude. Several thanks Even so My business is experiencing trouble with ur rss . Do not know why Struggle to sign up to it. Can there be every person obtaining identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 827965