Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: అమరావతి ఆందోళన.. ఇక అంతేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.. పది రోజులు, పాతిక రోజులు.. యాభై రోజులు కూడా దాటేశాయి. ఏమో, 100 రోజులు కూడా త్వరలోనే ఈ ఉద్యమం పూర్తి చేసేసుకుంటుందేమో. ఈలోగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యూహం రచిస్తున్న దరిమిలా.. అదేమంత ఈజీ కాదన్నది అధికార పార్టీ వర్గాలు చెబుతున్న మాట.

మరోపక్క, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమానికి ‘ఊపిరి’ పోసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందన్నది నిర్వివాదాంశం. టీడీపీ మద్దతు, జనసేన సంఘీభావం, భారతీయ జనతా పార్టీ పరామర్శలు.. వామపక్షాల అండదండలు.. ఇవన్నీ పక్కన పెడితే, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు చేస్తోన్న ఉద్యమానికి ఎవరైనా హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

ఈ రోజుల్లో అప్పనంగా ఒక్క రూపాయి అయినా ఎవరికీ ఇవ్వడానికి ఇష్టపడరు చాలామంది. అలాంటిది, భూముల్ని ప్రభుత్వానికి అప్పగించేస్తారా.? అమరావతి రైతులు ఆ తెలివి తక్కువ పనే చేశారు. ప్రభుత్వాన్ని నమ్మడం అనేది నిజంగానే రైతులు చేసిన అతి పెద్ద తప్పిదం. ప్రభుత్వం మారగానే, రైతుల ఆశలు అడియాసలైపోవడం ఖాయమనే చర్చ గతంలోనూ జరిగింది.

‘అబ్బే, మేం అలా చేయం..’ అని చెప్పిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు రైతుల్ని నిండా ముంచేసింది. అప్పుడు పాదయాత్రలో రైతులకు హామీలు గుప్పించేసిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మొహం చాటేసుకుని మరీ అమరావతిలో పయనిస్తున్నారు.. అధికారిక కార్యక్రమాల కోసం. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఇలాంటి వైపరీత్యాలు సర్వ సాధారణం.

రైతులు ఏం చేయగలరు.? మహా అయితే వంద రోజుల పాటు ఆందోళన చేయగలరు.. ఇంకా గట్టిగా అంటే ఇంకో వంద రోజులు అదే పని చేయగలరు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే.? అప్పుడే పగటి పూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉద్యమకారుల్ని నిర్వీర్యం చేసేస్తున్నాయి.

దాదాపు 40 మంది అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం దిగి రావడంలేదు. ముందు ముందు ఆ మరణాలు మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు విశాఖకీ, ఇంకోపక్క కర్నూలుకీ కార్యాలయాల తరలింపు దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. అయితే, కోర్టు మొట్టికాయలేయడంతో ఆ వ్యవహారం కాస్త సస్పెన్స్‌లో పడిందనుకోండి.. అది వేరే విషయం. ‘అరిచీ అరిచీ ఆందోళనకారులు ప్రభుత్వానికి సరెండర్‌ అవుతారు’ అనే ఆలోచనతోనే జగన్‌ సర్కార్‌ వున్నట్లు తెలుస్తోంది.

అధికారం కోసం రైతుల జపం చేస్తారు.. అధికారం కోసం అడ్డమైన కట్టుకథలూ చెబుతారు.. అధికారంలోకొచ్చాక కొంప ముంచేస్తారు.. రాజకీయ నాయకుల తీరే అంత. వైఎస్‌ జగన్‌ కూడా ఓ సగటు రాజకీయ నాయకుడే కదా.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...