ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.. పది రోజులు, పాతిక రోజులు.. యాభై రోజులు కూడా దాటేశాయి. ఏమో, 100 రోజులు కూడా త్వరలోనే ఈ ఉద్యమం పూర్తి చేసేసుకుంటుందేమో. ఈలోగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యూహం రచిస్తున్న దరిమిలా.. అదేమంత ఈజీ కాదన్నది అధికార పార్టీ వర్గాలు చెబుతున్న మాట.
మరోపక్క, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమానికి ‘ఊపిరి’ పోసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందన్నది నిర్వివాదాంశం. టీడీపీ మద్దతు, జనసేన సంఘీభావం, భారతీయ జనతా పార్టీ పరామర్శలు.. వామపక్షాల అండదండలు.. ఇవన్నీ పక్కన పెడితే, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు చేస్తోన్న ఉద్యమానికి ఎవరైనా హేట్సాఫ్ చెప్పాల్సిందే.
ఈ రోజుల్లో అప్పనంగా ఒక్క రూపాయి అయినా ఎవరికీ ఇవ్వడానికి ఇష్టపడరు చాలామంది. అలాంటిది, భూముల్ని ప్రభుత్వానికి అప్పగించేస్తారా.? అమరావతి రైతులు ఆ తెలివి తక్కువ పనే చేశారు. ప్రభుత్వాన్ని నమ్మడం అనేది నిజంగానే రైతులు చేసిన అతి పెద్ద తప్పిదం. ప్రభుత్వం మారగానే, రైతుల ఆశలు అడియాసలైపోవడం ఖాయమనే చర్చ గతంలోనూ జరిగింది.
‘అబ్బే, మేం అలా చేయం..’ అని చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రైతుల్ని నిండా ముంచేసింది. అప్పుడు పాదయాత్రలో రైతులకు హామీలు గుప్పించేసిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మొహం చాటేసుకుని మరీ అమరావతిలో పయనిస్తున్నారు.. అధికారిక కార్యక్రమాల కోసం. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఇలాంటి వైపరీత్యాలు సర్వ సాధారణం.
రైతులు ఏం చేయగలరు.? మహా అయితే వంద రోజుల పాటు ఆందోళన చేయగలరు.. ఇంకా గట్టిగా అంటే ఇంకో వంద రోజులు అదే పని చేయగలరు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే.? అప్పుడే పగటి పూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉద్యమకారుల్ని నిర్వీర్యం చేసేస్తున్నాయి.
దాదాపు 40 మంది అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం దిగి రావడంలేదు. ముందు ముందు ఆ మరణాలు మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు విశాఖకీ, ఇంకోపక్క కర్నూలుకీ కార్యాలయాల తరలింపు దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. అయితే, కోర్టు మొట్టికాయలేయడంతో ఆ వ్యవహారం కాస్త సస్పెన్స్లో పడిందనుకోండి.. అది వేరే విషయం. ‘అరిచీ అరిచీ ఆందోళనకారులు ప్రభుత్వానికి సరెండర్ అవుతారు’ అనే ఆలోచనతోనే జగన్ సర్కార్ వున్నట్లు తెలుస్తోంది.
అధికారం కోసం రైతుల జపం చేస్తారు.. అధికారం కోసం అడ్డమైన కట్టుకథలూ చెబుతారు.. అధికారంలోకొచ్చాక కొంప ముంచేస్తారు.. రాజకీయ నాయకుల తీరే అంత. వైఎస్ జగన్ కూడా ఓ సగటు రాజకీయ నాయకుడే కదా.!
641082 534896I tried to submit a comment earlier, although it has not shown up. I will remember this. 127329