Aishwarya Thatikonda : డల్లాస్ అలెన్ అవుట్ లెట్ ప్రీమియం మాల్ లో దుండగులు చొరబడి విచక్షరాహిత్యంగా కాల్పులకు తెగబడ్డారు. దాంతో ఏకంగా 9 మంది మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. మే 7వ తారీకు శనివారం మధ్యాహ్నం సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా స్థానికుల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఐశ్యర్య తాడికొండ మృతి చెందారు. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి షాపింగ్ లో ఉంది. ఇదే సంఘటనలో ఐశ్వర్య స్నేహితురాలు కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఐశ్వర్య మెక్సికన్ లో నివశిస్తూ ఉంది. 2020 లో యూఎస్ లో మాస్టర్స్ పూర్తి చేసిన ఆమె స్థానికంగా ఉన్న ప్రముఖ సివిల్ ఇంజనీరింగ్ సంస్థలో విధులు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆమె పార్థివ దేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐశ్వర్య మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతుంది. ఆమె ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది.