సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు.. అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘తెలంగాణకు బడ్జెట్లో పెట్టిన కోతలపై కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మతాల మధ్య చిచ్చు పెట్టి.. విధ్వేషాలు రెచ్చగొట్టే పార్టీ బీజేపీ. హైదరాబాద్ కు వరదలు వస్తే నిధులేమైనా ఇప్పించారా..? పేదలను కొట్టి గద్దలకు పెట్టే పార్టీ బీజేపీ. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెరగాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ భాషే మాట్లాడుతున్నారు.
‘తెలంగాణ వచ్చింది కాబట్టే మీరు కేంద్ర మంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బ్లాక్ డేగా అమిత్ షా అభివర్ణిస్తే.. అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి మాట్లాడలేదు. తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రధాని మోదీ మాట్లాడితే ఊరుకున్నారు. మీరా.. తెలంగాణ ఉద్యమం, అమరవీరుల స్థూపం గురించి మాట్లాడేది’ అని ప్రశ్నించారు.
‘’
35135 601289I like what you guys are up too. Such smart work and reporting! Carry on the superb works guys Ive incorporated you guys to my blogroll. I feel it will improve the value of my website 486422
933481 222225hello!,I like your writing so much! share we communicate extra approximately your post on AOL? I need an expert in this space to solve my dilemma. Maybe that is you! Seeking ahead to see you. 118991