ఫినాలే మెడల్ కోసం మొదటి లెవల్ లో మొత్తం ఏడుగురు పోటీ పడ్డ విషయం తెల్సిందే. ఏడుగురు పాల టాస్క్ ఆడగా మొదట అవినాష్.. ఆ తర్వాత అరియానా చివరగా మోనాల్ లు బయటకు వెళ్లి పోయారు. అభిజిత్, హారిక, అఖిల్ మరియు సోహెల్ లు మెడల్ పోటీ కోసం రెండవ రౌండ్ కు వెళ్లారు. మొదటి రౌండ్ లో అఖిల్ మరియు సోహెల్ లు కలిసి ఆడారు అంటూ అవినాష్ మరియు అఖిల్ అన్నారు. నిన్నటి ఎపిసోడ్ గొడవ నేడు కూడా కంటిన్యూ అయ్యింది. మోనాల్ వెళ్లి అవినాష్ తో గొడవను క్లీయర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. కాని అవినాష్ మాత్రం అందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా అనిపించలేదు.
మరో వైపు అవినాష్ మళ్లీ మీరు ఇద్దరు కలిసి ఆడారు అంటూ సోహెల్ మరియు అఖిల్ ను ఉద్దేశించి అన్నాడు. దాంతో మళ్లీ రచ్చ జరిగింది. అది మా గేమ్ ప్లాన్ అంటూ సోహెల్ చెప్పడంతో ఓ రేంజ్ వరకు మళ్లీ గొడవ వెళ్లింది. ఇక లెవల్ 2 లో భాగంగా నలుగురు ఇంటి సభ్యులు కూడా తమకు కేటాయించిన మట్టిలో పై నుండి పడే పూలను నాటాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ పూలు నాటితే వారిలో ఇద్దరు విన్నర్స్ గా నిలుస్తారు.
పై నుండి పడుతున్న పూలను అందుకోవడం కోసం సోహెల్ పులిలా కదిలినట్లుగా అనిపించింది. సోహెల్ తనకు అడ్డు వచ్చిన వారిని ఈడ్చి వేసి మరీ పూలను తీసుకున్నాడు. హారికను ఫిజికల్ వీక్ చేసి ఆమె నుండి పూలను లాగేసుకోవడంలో సోహెల్ సఫలం అయ్యాడు. అయితే ఈ సమయంలో హారిక కన్నీరు పెట్టుకుంది. చేతిలో నుండి గుంజుకోనివ్వరు.. అక్కడ నుండి తీసుకోనివ్వరు ఎలా అంటూ బిగ్ బాస్ కు ఫిర్యాదు చేసింది. మొత్తానికి బిగ్ బాస్ లో స్ట్రాంగ్ గా అనిపించిన హారిక కన్నీరు పెట్టకోవడంతో నేటి ఎపిసోడ్ ఎంతగా ఫిజికల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఈ టాస్క్ లో విన్నర్ ఎవరు అనేది అందరికి ఆసక్తిని రేకెత్తిస్తుంది.
903514 423867I adore foregathering valuable details , this post has got me even a lot more information! . 282644