కరోనా వ్యాక్సిన్ అన్నట్లుగానే 2021 ఆరంభంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్ ను అత్యవసర పరిస్థితుల్లో ఇస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ ను అందరికి ఇవ్వడం అంటే సాధ్యం అయ్యే పని కాదు అంటున్నారు.
ఇండియాలో ఉన్న అందరికి కూడా వ్యాక్సిన్ ను ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏడాదిన్నర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో మేధావులు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన పని లేదు అంటున్నారు.
ప్రజలు అందరికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు. నిర్ణీత సంఖ్యలో వ్యాక్సిన్ ను ఇవ్వడం వల్ల అరికట్టే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవ అంటున్నారు.
జనాభా మొత్తానికి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది సాధ్యం అయ్యే పని కాదంటూ ఆయన తేల్చి చెప్పారు. కోవిడ్ కు అడ్డు కట్ట వేసేందుకు ఖచ్చితంగా కేంద్రం కట్టుబడి ఉంది. అందుకోసం అతి త్వరలోనే వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెడుతుందని అన్నారు.
962575 767124Hi there! Someone in my Myspace group shared this website with us so I came to give it a look. Im undoubtedly loving the data. Im bookmarking and will probably be tweeting this to my followers! Outstanding blog and wonderful style and design. 592507
625829 493810TeenVogue? Searching for fashion advice, celebrity buzz or beauty trends? Locate it all in Teen Vogue 696063