ఆంధ్రప్రదేశ్ని మొత్తం నాలుగు ప్రాంతాలుగా జీఎన్ రావు కమిటీ విభజించింది. కమిటీ విభజిస్తే మాత్రం.. ఆ ప్రాంతాలు విడిపోతాయా.? కానీ, అసలు విభజన ఎందుకు జరిగింది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలున్నాయి. ఇది ఎప్పటినుంచో ఇలాగే వుంది. ఉభయ గోదావరి జల్లాల్ని ఒక యూనిట్గా చూస్తుంటాం. దానికి అదనంగా కృష్ణా జిల్లాని కలిపారు. మామూలుగా అయితే, కృష్ణా – గుంటూరు జిల్లాలు ఓ యూనిట్.
గుంటూరు జిల్లాకి ప్రకాశం, నెల్లూరుతో కలిపి ఓ యూనిట్గా మార్చారు. రాయలసీమ.. ముఖ్యమంత్రి సొంత ప్రాంతం గనుక.. అందులో నాలుగు జిల్లాలున్నా, దాన్ని విభజించలేదన్నమాట జీఎన్ రావు కమిటీ. మూడేసి ప్రాంతాల్లో మూడేసి జిల్లాలు, ఓ ప్రాంతంలో మాత్రం నాలుగు జిల్లాలు.. ఇదీ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని జీఎన్ రావు కమిటీ విభజించిన తీరు.
ఈ విభజన ఇప్పుడు కృష్ణా – గుంటూరు జిల్లా వాసుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ‘అసలు అలా విభజన చేయాల్సిన అవసరం ఏంటి.?’ అని కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగానే ఈ ఆలోచనను తెరపైకి తెచ్చిందన్నది వారి అభిప్రాయం.
అసలు, నాలుగు ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించినా.. ఆ లెక్కన ప్రజలు భావిస్తారని అనుకోవడానికి వీల్లేదు. కానీ, ప్రజల మధ్య ప్రాంతాల వారీగా విభజన రేఖను గీయడం అనేది కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రాంతాల మధ్య విభజనే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని రెండుగా విడదీసేసింది. ఒకానొక దశలో మూడు ముక్కలు చేయాలన్న ప్రతిపాదన వచ్చినా.. చివరికది రెండు ముక్కలకే పరిమితమయ్యింది.
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమవుతుంది.? పాలకుల్లో అడ్డగోలు ఆలోచనలు వుంటే.. నాలుగు ముక్కలేం ఖర్మ.. నలభై ముక్కలైనా అవ్వొచ్చు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు కదా.. మూడు కాదు, ముప్ఫయ్ రాజధానులైనా పెడతాం.. అని. అది రాజధానికే కాదు.. రాష్ట్ర ప్రజల మధ్య విభజనకీ వర్తించాలనే ఆలోచన అధికార పార్టీలో లేదని ఎలా అనుకోగలం.?
942198 640183Id forever want to be update on new articles on this web site, bookmarked ! . 645018
911842 854031Thank you for sharing with us, I conceive this website genuinely stands out : D. 538965