విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా చేస్తామని ఏపీ సర్కారు ప్రకటించగానే పార్టీ వైఖరికి అతీతంగా స్వాగతించిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషయంలో యూ టర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. తొలుత సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీ నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో ఆయన అధికార పార్టీలో చేరడం ఖాయమంటూ ప్రచారం జరిగింది.
ఎప్పటి నుంచో పార్టీ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న గంటా.. ఇక వైసీపీలో చేరతారని, రాజధాని మార్పును ఇందుకు అనువుగా ఉపయోగించుకుంటారని ప్రచారం జరిగింది. అయితే, అధికార పార్టీ అంగీకరించలేదో.. లేక ఆయనకే ఇష్టం లేదో తెలియదు కానీ.. పార్టీ మార్పు జరగలేదు. ఈ నేపథ్యంలో రాజధాని వ్యవహారంపై గంటా వైఖరి మారింది. పరిపాలన రాజధానిగా విశాఖను చేయడం అంత సులభం కాదన్నారు. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కోర్టులు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.
విశాఖ వాసిగా తాను అక్కడ రాజధాని ఏర్పాటును స్వాగతిస్తానని, కానీ ఈ విషయంలో పార్టీ వైఖరికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తే ఇక్కడ రాజకీయంగా సమాధి కావడమే అని గతంలో వ్యాఖ్యనించిన గంటా.. ఇప్పుడు అందుకు విరుద్దమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అధికార పార్టీలో చేరడానికి వీలు కుదరకపోవడంతోనే గంటా ఈ విషయంలో యూ టర్న్ తీసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. మళ్లీ క్రియాశీలమవుతున్నారు. త్వరలో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో సమావేశాలు మొదలుపెట్టారు.
176470 246006What others have stated and in some uncommon cases, suicide may well occur. 947624