దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ కార్మికులకు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. గతేడాది సినీ కార్మికులకు నిత్యావసరాలు, మెడిసిన్స్ ఇచ్చి అండగా నిలిచిన ‘సీసీసీ’ ద్వారా.. ‘అపోలో’ ఆసుపత్రి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నట్లు పేర్కోన్నారు. టీకాలను అపోలో 24/7 సహకారంతో సినీ కార్మికులతో పాటు సినీ జర్నలిస్టులకు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈమేరకు ట్విట్టర్ ద్వారా ఓ వీడియో సందేశం ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంల ఏప్రిల్ 22 (గురువారం) నుంచి మొదలై నెల రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో 45 సంవత్సరాలు దాటిన వారు.. వారి జీవిత భాగస్వామి కూడా 45 సంవత్సరాలు దాటి ఉంటే ఈ కరోనా టీకాను ఉచితంగా పొందొచ్చని తెలిపారు. కరోనా టీకా కోసం అర్హులైన వారు తమ అసోసియేషన్లలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.
329078 602660Thank you for every other informative site. Exactly where else could I get that type of information written in such a perfect means? Ive a mission that Im just now operating on, and Ive been at the appear out for such info. 826767
957628 554824What a lovely weblog. I will surely be back again. Please sustain writing! 311583