సేవ్ నల్లమల.. అంటూ సినీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవులు, తెలుగు నేలకు ఊపిరితిత్తుల్లా పేరొందాయి. ఎక్కడో అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు రగిలితే స్పందించిన తెలుగు సినీ పరిశ్రమ, నల్లమలను యురేనియం తవ్వకాలతో నాశనం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తోంటే ఎందుకు నోరు మెదపడంలేదన్న చర్చ సర్వత్రా జరిగింది.
సినీ పరిశ్రమ తరఫున మొట్టమొదటగా నల్లమల విషయమై స్పందించింది పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తరఫున మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ నల్లమల వ్యవహారంపై గళం విప్పారు. ‘సేవ్ నల్లమల’ అంటూ నినదించారు. ఇక, అక్కడినుంచి సినీ పరిశ్రమలో కదలిక మొదలయ్యింది.
ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ‘సేవ్ నల్లమల’కు మద్దతు పలికిన సినీ జనం, ఇప్పుడు ఒకరొకరుగా మీడియా ముందుకు వస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఓ ఛానల్తో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో మనల్ని మనం నాశనం చేసుకోవడం మంచిది కాదన్నాడు. నీటి వనరుల్ని కలుషితం చేసే యురేనియం తవ్వకాలపై ప్రతి ఒక్కరూ గళం విప్పాలని నినదించాడు.
Also Read: జనసేనానితో గొంతు కలిపిన విజయ్ దేవరకొండ
మరోపక్క, సినీ నటి, బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించింది. ‘భావితరాలకు మెరుగైన జీవితం అందించడం కాదు.. కనీసం ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితాన్ని అయినా అందించాలంటే యురేనియం తవ్వకాల జోలికి వెళ్ళకూడదు’ అని అనసూయ చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరుగుతోంది. మరోపక్క, ‘మీరు ఇప్పుడు కట్టుకున్న ఇళ్ళు ఒకప్పుడు అడవుల్ని నరికేయడం ద్వారా ఏర్పడ్డ పట్టణాల్లోనే వున్నాయ్..’ అంటూ కొందరు నెటిజన్లు, సెలబ్రిటీలను ట్రోల్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే, సెలబ్రిటీల పోరుపై స్పందించిన మంత్రి కేటీఆర్, యురేనియం తవ్వకాల విషయమై వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి మాట్లాడతానంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం, కేటీఆర్ తీరుని తప్పు పడుతున్నారు. ‘యురేనియం తవ్వకాలకు అనుమతినిచ్చింది మీ ప్రభుత్వమే.. ఇప్పుడు మీరు మళ్ళీ పబ్లిసిటీ స్టంట్లు చేయడమా.?’ అని నిలదీశారు రేవంత్రెడ్డి.
654314 211710Hello fellow internet master! I genuinely enjoy your website! I liked the color of your sidebar. 902322